Asianet News TeluguAsianet News Telugu

లేటెస్ట్ అప్డేట్: మహేష్ ని కలిసి కథ చెప్పిన పూరి

పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్లే. ‘పోకిరి’ చిత్రం అయితే మహేష్ కు  స్టార్‌డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో  ఒకటిగా చరిత్రకెక్కింది.  

purijagan met Mahesh recently and narrated Plot line
Author
Hyderabad, First Published Mar 20, 2019, 9:36 AM IST

పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్లే. ‘పోకిరి’ చిత్రం అయితే మహేష్ కు  స్టార్‌డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో  ఒకటిగా చరిత్రకెక్కింది.  ఆ తర్వాత వీరిద్దిరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ లో సూర్య భాయిగా అదిరిపోయే డైలాగులతో మహేష్ ని మరో మెట్టు ఎక్కించాడు పూరీ జగన్నాథ్.

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌ కోసం ఇండస్ట్రీ, అభిమానులు ఎదురుచూసారు. దాంతో వీరి కాంబోలో మూడో సినిమాగా ‘జనగణమన’ అనే  సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా చేసే సమయానికి పూరీ జగన్నాథ్ వరుస డిజాస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. అంతేకాదు పూరి చెప్పిన డైలాగులు అయితే బాగున్నాయి కానీ కథ,కథనం మహేష్ కు నచ్చక ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ పూరి పట్టువదలని విక్రమార్కుడులా మహేష్ వెనకపడుతూనే ఉన్నాడు.

అందుతున్న సమాచారం మేరకు తాజాగా మహేష్ ని కలిసిన పూరి ఓ స్టోరీ లైన్ వినిపించారు.మహేష్ ఇప్పటిదాకా చెయ్యని  సరికొత్త క్యారక్టరైజేషన్ తో స్టోరీ నేరేట్ చేసాడట. విని వెంటనే ఎగ్జైట్ అయిన మహేష్ ...పూర్తి స్క్రిప్టుతో కనపడమని , ఖచ్చితంగా సినిమా చేద్దామని మాట ఇచ్చారట. దాంతో మరింత జోష్ తో పూరి ఆ స్క్రిప్టుపై కూర్చుంటన్నారట. రామ్ తో చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ పూర్తి అయ్యేలోగా ఈ స్క్రిప్టు పూర్తి చేసి ఓకే అనిపించుకోవాలనే తపనతో పూరి ఉన్నారట. 

Follow Us:
Download App:
  • android
  • ios