Asianet News TeluguAsianet News Telugu

'సాహో': షాకింగ్ ప్రీరిలీజ్ బిజినెస్!

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సాహో'. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ పెరగడంతో 'సాహో' సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 

Prabhas Saaho overseas rights for Rs 42 Cr
Author
Hyderabad, First Published Mar 8, 2019, 1:05 PM IST

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'సాహో'. బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ పెరగడంతో 'సాహో' సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమా కోసం దాదాపు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి. 

ఈ సినిమా థియేటర్ లోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దానికి తగ్గట్లే సినిమా ప్రీరిలీజ్  బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది.

ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు మొత్తం భారీ రేటిచ్చి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ రూ.42 కోట్లు చెల్లించి మరీ ఓవర్సీస్ హక్కులు సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.  

Follow Us:
Download App:
  • android
  • ios