సంక్రాంతి రేసులో గెలిచేదెవరు..?
టాలీవుడ్ లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఎక్కువ సంఖ్యలో సినిమాలను విడుదల చేస్తుంటారు. బిజినెస్ పరంగా సంక్రాంతి కలిసొస్తుందని భావిస్తుంటారు.
టాలీవుడ్ లో సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఎక్కువ సంఖ్యలో సినిమాలను విడుదల చేస్తుంటారు. బిజినెస్ పరంగా సంక్రాంతి కలిసొస్తుందని భావిస్తుంటారు. అయితే ఎక్కువగా పెద్ద సినిమాలే బరిలోకి దిగుతుంటాయి. ఈసారి కూడా నాలుగు సినిమాలు సంక్రాంతికి రావడానికి పోటీ పడుతున్నాయి.
అందులో రెండు పెద్ద సినిమాలు కాగా, ఒకటి మీడియం బడ్జెట్ సినిమా, మరొకటి డబ్బింగ్ సినిమా. దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ మొదటి భాగం కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలానే రజినీకాంత్ నటించిన 'పేటా' సినిమా జనవరి 10న డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి. రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'వినయ విధేయ రామ' సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఆ మరుసటి రోజు వరుణ్ తేజ్-వెంకటేష్ లు నటించిన 'ఎఫ్2' సినిమా విడుదల కానుంది. పండగ మొదలయ్యేది 14న కాబట్టి ఈలోపే సినిమాల రిజల్ట్స్ తెలిసిపోతాయి. సో.. పండక్కి ఏ సినిమా చూడాలనే క్లారిటీ ప్రేక్షకులకు వస్తుంది.
మరి వీటిలో ఏ సినిమా పండగ సీజన్ ని క్యాష్ చేసుకుంటుందో చూడాలి.. గతంలో సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి!