Asianet News TeluguAsianet News Telugu

ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ అవసరమా?

భారత్ - పాక్ సరిహద్దున యుద్ధ వాతావరణం ఏ రేంజ్ లో వేడెక్కుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యుద్ధ మేఘాలకు ఎండ్ కార్డు పడాలంటే ఇంకా చాలా సమయం ఉంది. అయితే పలువురు సినిమా స్టార్స్ సినిమాల ప్రమోషన్స్ తో బిజీగా ఉండడంతో నెటిజన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. 

followers angry comments on kesari promotions
Author
Hyderabad, First Published Mar 1, 2019, 2:58 PM IST

భారత్ - పాక్ సరిహద్దున యుద్ధ వాతావరణం ఏ రేంజ్ లో వేడెక్కుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యుద్ధ మేఘాలకు ఎండ్ కార్డు పడాలంటే ఇంకా చాలా సమయం ఉంది. అయితే పలువురు సినిమా స్టార్స్ సినిమాల ప్రమోషన్స్ తో బిజీగా ఉండడంతో నెటిజన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. 

ఈ సమయంలో అంతా దేశం వైపు చూస్తుంటే మీరు మాంత్రం సినిమా ప్రచారాలను చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల హీరో అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో కేసరి సినిమాకు సంబందించిన ప్రచారాలను ముమ్మరం చేశాడు.రీసెంట్ గా ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు, ఇక నిర్మాత కరణ్ జోహార్ కూడా ప్రమోట్ చేస్తుండడంతో నెటిజన్స్ ఈ విధంగా స్పందించారు. 

దేశమంతా ఒక్కటై భారత్ కు మద్దతుగా నిలుస్తుంటే. మీరు యుద్ధ సమయంలో కూడా ప్రమోషన్స్ చేయాలా? దేశం కోసం ఆ కార్యక్రమాలను కొన్ని రోజులు వాయిదా వేస్కోలేరా? అని కౌంటర్లు ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ చాలా వరకు సైలేంటి అయ్యింది.. ఇకపోతే అక్షయ్ కుమార్ పుల్వామా బాధిత కుటుంబలకు 5 కోట్ల విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇక కేసరి సినిమా మార్చ్ 1న రిలీజ్ కాబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios