Asianet News TeluguAsianet News Telugu

'అత్తారింటికి దారేది' రీమేక్ తో భారీ లాస్.. లబోదిబో మంటున్న నిర్మాతలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం అత్తారింటికి దారేది. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా త్రివిక్రమ్ మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

 

Atharintiki Daredi remake gest huge loss
Author
Hyderabad, First Published Sep 28, 2019, 2:23 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం అత్తారింటికి దారేది. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా త్రివిక్రమ్ మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

అత్తారింటికి దారేది సాధించిన ఘనవిజయంతో ఈ చిత్రాన్ని తమిళంలో స్టార్ హీరో శింబు 'వందా రాజవదాన్ వరువేన్' పేరుతో రీమేక్ చేశాడు. సుందర్ సి ఈ చిత్రానికి దర్శకుడు. మేఘా ఆకాష్, కేథరిన్ ఈ చిత్రంలో కథానాయికలు గా నటించడం విశేషం. తెలుగులో నదియా పోషించిన పాత్రని తమిళంలో రమ్యకృష్ణ చేసింది. 

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. తమిళ ప్రేక్షకులకు ఈ కథ ఏ మాత్రం కనెక్ట్ కాలేదు. ఫలితంగా చిత్ర నిర్మాతలకు తీవ్ర నష్టాలు మిగిలాయి. తాజాగా ఈ చిత్రానిని నిర్మాతలకు దాదాపు 14 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ఈ చిత్రాన్ని నిర్మించింది. 

ఈ విషయంలో నిర్మాణ సంస్థ శింబుని నిందించింది. శింబు షూటింగ్ లకు ఆలస్యంగా వస్తాడని.. సినిమా పరాజయంతో పాటు అతడి వైఖరి నిర్మాతలకు అదనపు భారం అని పేర్కొంది. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios