టీజర్ పోస్టర్ : ఇది డబల్ ‘అర్జున్రెడ్డి’
టాలీవుడ్ లో రికార్డులు సృష్టించిన ‘అర్జున్రెడ్డి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే
టాలీవుడ్ లో రికార్డులు సృష్టించిన ‘అర్జున్రెడ్డి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ చేసిన పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. కియారా అడ్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్రెడ్డి వంగానే హిందీ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు.
‘కబీర్ సింగ్’ టైటిల్ రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ చూడగానే అర్జున్ రెడ్డి కు డబుల్ డోస్ అనే అర్దం వస్తుంది. రెండు జాయింట్లను ఒకేసారి నోట్లో పెట్టుకొని పొగ పీలుస్తున్న షాహిద్ ఈ పోస్టర్ లో ఉండడం ఆసక్తికరంగా ఉంది.
ఒక సిలౌట్ లాగా లైటింగ్ ఎఫెక్ట్ తో డిజైన్ చేయడం అదరకొట్టింది. 'కబీర్ సింగ్' టీజర్ ను ఏప్రిల్ 8 న రిలీజ్ చేస్తామని పోస్టర్లో తెలిపారు. టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, క్రిషన్ కుమార్, అశ్విన్ వర్దే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2019 జూన్ 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మరోపక్క తమిళంలోనూ ‘అర్జున్రెడ్డి’ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు విక్రమ్ కుమారుడు ధృవ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారు. మరి ఈ రెండు రీమేక్ చిత్రాలు ‘అర్జున్రెడ్డి’ సృష్టించినన్ని రికార్డులు సృష్టిస్తాయో లేదో వేచిచూడాలి.