ఆ రెండు సినిమాలు కలిపితే.. అఖిల్ కొత్త చిత్రం కథట!
ఒక కొత్త సినిమా ప్రారంభమైందంటే ఆ చిత్రం కథేంటి అనే వార్తలు మీడియాలోనే కాదు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ హల్ చల్ చేస్తూంటాయి.
ఒక కొత్త సినిమా ప్రారంభమైందంటే ఆ చిత్రం కథేంటి అనే వార్తలు మీడియాలోనే కాదు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ హల్ చల్ చేస్తూంటాయి. వాటిలో తొంభై శాతం ఊహాగానాలు ఉంటే పదిశాతం నిజాలు ఉంటాయి. ఆ టీమ్ కు సంభందించిన వాళ్లు ఎవరైనా ఉంటే అసలు వార్తలు బయిటకు వస్తూంటాయి. రెండు రోజుల క్రితం అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ఓ సినిమా మొదలైంది. ఆ చిత్రం గతంలో భాస్కర్ చేసి హిట్ కొట్టిన రెండు సినిమాల కలిపతే ఎలా ఉంటుందో అలా ఉండబోతోందంటున్నారు. తండ్రి - కొడుకుల సెంటిమెంట్ కి ఓ అందమైన ప్రేమకథని కలిపి స్క్రిప్టు రెడీ చేసారట భాస్కర్.
తన గత చిత్రాలు లోగా ఈసారి కూడా కుటుంబ భావోద్వేగాలకి పెద్ద పీట వేశాడని, బొమ్మరిల్లు, పరుగు కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తండ్రి పాత్ర కోసం ఓ ప్రముఖ నటుడిని సంప్రదించారట. అయితే ఇంకా ఆయన డేట్స్ ఫైనల్ కాలేదట. ఆయన ఎవరనెవరన్నది తెలియాల్సివుంది. అలాగే హీరోయిన్ విషయంలో ఇంకా ఓ స్పష్టత రాలేదు. ఇప్పటికే చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాళ్లలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 ప్రొడక్షన్స్ బ్యానర్పై ‘బన్నీ’ వాసు, వాసూ వర్మలు నిర్మించనున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్లో స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి కెమెరా: వి. మణికందన్, సంగీతం: గోపీ సుందర్.