హీరోకు రెండు బ్రెయిన్లు: 'బుర్రకథ' టీజర్
డబ్బింగ్ ఆర్టిస్ట్, మంచి నటడు అయిన సాయికుమార్ కుమారుడు ఆది కు హీరోగా ఒక్క సినిమా కూడా సరైన బ్రేక్ ఇవ్వలేకపోయింది.
డబ్బింగ్ ఆర్టిస్ట్, మంచి నటడు అయిన సాయికుమార్ కుమారుడు ఆది కు హీరోగా ఒక్క సినిమా కూడా సరైన బ్రేక్ ఇవ్వలేకపోయింది. తొలి చిత్రం ప్రేమకావాలి తర్వాత ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు . అన్ని అంతంత మాత్రం సినిమాలే. దాదాపు పదేళ్లుగా ఆ ప్లాఫ్ లతోనే ఎప్పటికైనా హిట్ కొట్టకపోతానా అనే ఆశతో కెరీర్ నెట్టుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఇప్పుడు బుర్రకథ అంటూ వస్తున్నాడు ఆది సాయికుమార్.
ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలకు కత్తిలాంటి డైలాగ్స్ రాసిన డైమండ్ రత్నం బుర్రకథ చిత్రంతో దర్శకుడిగా మారాడు . ఈరోజు బుర్రకథ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో . ఈ టీజర్ చూస్తూంటే ఇప్రెసివ్ గా ఉంది. ఓ మనిషికి రెండు బుర్రలు అనే కొత్త పాయింట్ తో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టేలా కనబడుతున్నాడీ హీరో.
'సంధ్యావందనంలో సంధ్యుంది', 'చదివే వేదాల్లో వేదుంది', 'ఏసే పద్మాసనంలో పద్ముంది', 'మరి మీ లైఫ్లో ఏముంది'? అంటూ.. ఆది చెప్పే డైలాగ్తో స్టార్ట్ అయిన టీజర్.. చాలా ఫన్నీగా ఉంది.
టీజర్తోనే ఈ మూవీ కాన్సెప్ట్ను క్లియర్గా చెప్పేసింది టీమ్. ఆది ఈ బుర్రకథ తో హిట్ కొడతాడా ? మళ్ళీ గాడిలో పడతాడా ? డైమండ్ రత్నం దర్శకుడిగా సక్సెస్ అవుతాడా ? అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ టీజర్ చూడండి.
పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంటర్ రూపొందిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ కీలకపాత్రలో నటించగా.. మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందించగా.. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.