మందిరాబేడీకు ట్విస్ట్... రమ్యకృష్ణతో రీషూట్...పూరి రిపేర్లు
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో ఎంపిక చేసారు. అయితే మొదట రమ్యకృష్ణ సీన్ లో లేదు. మందిరాబేడీతో సీన్స్ తీసారు.
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో ఎంపిక చేసారు. అయితే మొదట రమ్యకృష్ణ సీన్ లో లేదు. మందిరాబేడీతో సీన్స్ తీసారు. అయితే పూరి మొత్తం సినిమా చూసుకుని.. ఆ సీన్స్ బాగా రాకపోవడంతో ఇప్పుడు మందిరా బేడి ప్లేస్ లో రమ్యకృష్ణను పెట్టి ఆ సీన్స్ ను రీషూట్ చేస్తున్నారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పూరి దగ్గరుండి మరీ రిపేర్లు చేస్తున్నట్లు సమాచారం. పూరి సీన్ లోకి రావటంతో రమ్యకృష్ణ ఒప్పుకున్నట్లు సమాచారం.
`బాహుబలి` చిత్రంలో రాజమాత శివగామి నటించి సినీ ప్రేక్షకులను మెప్పించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలియటంతో ట్రేడ్ లోనూ ‘రొమాంటిక్’.పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్లో కనపడనుందని తెలుస్తోంది. మంగళవారం నుంచి జరుగుతున్న షెడ్యూల్లో రమ్యకృష్ణ జాయిన్ అయ్యారని తెలిసింది. ఇక ఇన్టెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. నరేశ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునైన తదితరులు ఈ చ్రితంలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కతోంది మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.