Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ పై తప్పుడు రాతలు.. పూనమ్ కౌర్ దిమ్మతిరిగే సమాధానం!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తరచుగా కొందరు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది శ్రీరెడ్డి వ్యవహారం చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. శ్రీరెడ్డి తరచుగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు చేస్తోంది. ఇక పూనమ్ కౌర్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. 

Poonam Kour gives clarity over Pawan kalyan and her tweet
Author
Hyderabad, First Published Nov 3, 2019, 11:20 AM IST

పవన్ కళ్యాణ్ పై కొందరు ఫిలిం సెలెబ్రిటీలు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు ప్రముఖులు పవన్ కి మద్దతు తెలుపుతుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా నటి పూనమ్ కౌర్ తన సంచలన వ్యాఖ్యలతో అప్పుడప్పుడూ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

Poonam Kour gives clarity over Pawan kalyan and her tweet

ముఖ్యంగా ఆమె ట్విట్టర్ లో పరోక్షంగా ఎవరినో ఉద్దేశించినట్లు అన్నట్లుగా ఉండే ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలో పూనమ్ కౌర్ చేసిన చాలా ట్వీట్స్ గురించి అభిమానుల్లో హాట్ హాట్ గా చర్చ జరిగింది. ఇటీవల పూనమ్ కౌర్ చేసిన మరో ట్వీట్ బాగా వైరల్ అయింది. 

'అబద్దాలు చెప్పే వాడు రాజకీయ నాయకుడు అవుతాడేమో కానీ.. నాయకుడు కాలేడు' అని ట్వీట్ చేసింది. పూనమ్ చేసిన ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే అని మీడియా మొత్తం వార్తలు రాసింది. పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. గతంలో పూనమ్ కౌర్, పవన్ గురించి కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 

పూనమ్ చేసిన ట్వీట్ కూడా పవన్ ని ఉద్దేశించే అని కొందరు పెద్ద ఎత్తున వార్తలు రాశారు. తన ట్వీట్ జనాల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళుతుండడంతో పూనమ్ కౌర్ మరో ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

Poonam Kour gives clarity over Pawan kalyan and her tweet

తాను చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించినవి కావని.. సాధారణంగా సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై తన అవగాహన అని పూనమ్ కౌర్ పరోక్షంగా తెలిపింది. పవన్ ని ఉద్దేశించి తప్పుడు రాతలు రాసిన మీడియాపై విరుచుకుపడింది కూడా. 

Poonam Kour gives clarity over Pawan kalyan and her tweet

'నేను చేసిన వ్యాఖ్యలు సమాజంలో జరుగుతున్న నిజానిజాల గురించి. కానీ మీరు మాత్రం ఏదేదో ఊహించుకుంటూ ఊహాలోకంలో విహరిస్తున్నారు. ముఖ్యంగా పైడ్ మీడియా తన వ్యాఖ్యలని తప్పుదోవ పట్టిస్తూ లబ్ది పొందుతోంది. నేను చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు సంబంధించినవి. మీరు మీరు ఊహాలోకంలోనే ఉండండి' అంటూ పూనమ్ కౌర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. 

పూనమ్ మొదట చేసిన ట్వీట్ తో కొంతమంది నెటిజన్లు పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేశారు. తాజాగా క్లారిటీ ఇవ్వడంతో పవన్ అభిమానులు సంతోషిస్తున్నారు. పవన్ ని తప్పుగా అర్థం చేసుకున్న వారికి పూనమ్ బుద్ధి చెప్పిందని అంటున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios