Meeku Matrame Cheptha: మూడు రోజుల్లో రూ.4.05 కోట్ల గ్రాస్.!
కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూనే తన అభిరుచి మేరకు విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్ కు డబుల్ ట్రీట్ గా మారింది. ఓచిన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడమే అందుకు నిదర్శనం.
హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా ఈ నెల 1న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పంచుతోంది. అంచనాలకు తగ్గట్టుగానే డీసెంట్ వసూళ్ల సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే రూ.4 కోట్ల 5 లక్షల గ్రాస్ కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది.
రాహుల్ గెలుపుపై శ్రీముఖి.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!
కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూనే తన అభిరుచి మేరకు విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్ కు డబుల్ ట్రీట్ గా మారింది. ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడమే అందుకు నిదర్శనం. ఇక హీరోగా నటించిన తరుణ్ భాస్కర్ తో పాటు ప్రధాన పాత్రధారులైన అభినవ్ గోమటం, అవంతికా మిశ్రా, పావని గంగిరెడ్డి, అనసూయ, నవీన్ జార్జ్ థామస్ ల నటన, టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారడంతో రాబోయే రోజుల్లో మరింత పెద్ద విజయంగా ఈ సినిమా నిలవబోతోందని చెప్పొచ్చు.
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా,
సంగీతం : శివకుమార్,
ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్,
కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ,
లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి,
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతినేని,
నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ.
రచన- దర్శకత్వం : షామీర్ సుల్తాన్