మహేష్ బాబు లాంచ్ చేయనున్న విజయ్ దేవరకొండ సినిమా ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగానే కాదు నిర్మాతగా కూడా మారాడు. పెళ్లి చూపులు చిత్రంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించాడు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. సమీర్ ఈ చిత్రానికి దర్శకుడు. హీరో విజయ్ దేవరకొండ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
నవంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దీనితో ప్రచార కార్యక్రమాలని షురూ చూస్తున్నారు. రేపు(అక్టోబర్ 16 బుధవారం) మీకు మాత్రమే చెప్తా చిత్ర ట్రైలర్ రిలీజ్ కానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కానుండడం విశేషం. బుధవారం సాయంత్రం 4:04 గంటలకు ట్రైలర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఈ చిత్రంలో వాణి భోజన్ హీరోయిన్ గా నటిస్తుండగా, యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా మీకు మాత్రమే చెప్తా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.