Bigg Boss 3: రాహుల్ తోపు పాట.. చింపేశాడన్న పునర్నవి!
ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది. భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు. ముందుగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ అందరూ తమ డాన్స్ లతో షోని మొదలుపెట్టారు
బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. టైటిల్ విన్నర్ ఎవరనే విషయం మరికాసేపట్లో తెలియనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది. భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు.
ముందుగా ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్అందరూ తమ డాన్స్ పెర్ఫార్మన్స్ తో షోని మొదలుపెట్టారు. హోస్ట్ నాగార్జున కూడా వారితో కలిసి చిందులేశారు. అనంతరం ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ తో టాప్ 5 కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ తో మాట్లాడిన నాగార్జున మన టీవీ ద్వారా ఐదుగురు ఫైనలిస్ట్ లతో మాట్లాడారు.
Bigg Boss3: నాగార్జున గ్రాండ్ ఎంట్రీ.. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే అంటున్న శివజ్యోతి
వారంతా తమలో ఎవరు గెలిచినా ఓకే అని అన్నారు. ఇక హౌస్ లో వారి జర్నీ గురించి పాట పాడాలని నాగార్జున రాహుల్ కి చెప్పారు. వెంటనే రాహుల్ పాట అందుకుంటే దానికి మిగిలిన నలుగురు డాన్స్ చేశారు. టాప్ 5 తోపు కంటెస్టంట్స్ అంటూ రాహుల్ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది.
రాహుల్ పాట అయిన తరువాత నాగార్జున.. పునర్నవిని పాట ఎలా ఉందని అడిగారు. దానికి పునర్నవి 'చింపేశారు' అంటూ కామెంట్ చేసింది. ఇప్పటికే రాహుల్ విన్నర్, శ్రీముఖి రన్నరప్ అనే ప్రచారంపై క్లారిటీ రావాలంటే ఈ రోజు షో ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే.