క్రికెట్ బెట్టింగ్ డబ్బుల కోసం కొట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్
వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన విద్యార్థులు, తేతలి సమీపంలోని వడ్లూరుకు చెందిన మరో విద్యార్థి మధ్య క్రికెట్ బెట్టింగ్ జరిగింది.
క్రికెట్ బెట్టింగ్ డబ్బుల కోసం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు దారుణంగా కొట్టుకున్నారు. డబ్బులు ఇవ్వలేదని ఓ విద్యార్థిని..మిగితా వారందరూ కలిసి దారుణంగా కొట్టారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన విద్యార్థులు, తేతలి సమీపంలోని వడ్లూరుకు చెందిన మరో విద్యార్థి మధ్య క్రికెట్ బెట్టింగ్ జరిగింది.
వడ్లూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రికెట్ బెట్టింగ్ సొమ్ము విషయంలో వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నాడు. అయితే తమకు ఇంకా సొమ్ములు రావాలంటూ ఆ విద్యార్థిపై సహచర విద్యార్థులు కొట్లాటకు దిగారు. ఆ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోలు మంగళవారం వాట్సప్లో హల్ చల్ చేయడంతో విషయం బయటకు పొక్కింది.