Asianet News TeluguAsianet News Telugu

పొంచివున్న బుల్ బుల్ తుఫాను...కోస్తాలో ప్రమాద హెచ్చరికలు జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా రూపాంతరం చెందుతున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి బుల్ బుల్ అని నామకరణం చేసినట్లు....దీని ప్రభావం  కోస్తాపై కూడా వుంటుందని అధికారులు తెలిపారు.  

bul bul cyclone effect... imd predicts heavy rainfall in odisha, west bengal and ap costal area
Author
Visakhapatnam, First Published Nov 6, 2019, 8:44 PM IST

విశాఖపట్నం: తూర్పు, మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఒడిషాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరాన, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ దీవులకు 920 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయాన కేంద్రీకృతమై వుందని తెలిపారు. ఇది ఇవాళ రాత్రికి  మరింత తీవ్రమైన వాయుగుండంగా మారి 24 గంటల్లో తుఫాన్ గా, ఈ నెల 9 నాటికి తీవ్రతుఫాన్ గా మారే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఈ తుపానుకు బుల్ బుల్ అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఇది ఆగ్నేయ దిశగా ప్రయాణించి  ఒరిస్సా లేదా పశ్చిమ బెంగాల్ తీరం దాటే అవకాశాలున్నట్లు తెలిపారు. ఈ ప్రభావం కోస్తాపై కూడా వుండే అవకాశం వుండటంతో అన్ని ప్రధాన పోర్ట్ లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

read more  బంగాళాఖాతంలో వాయుగుండం... పొంచివున్న తుపాను ముప్పు

 అక్టోబర్ నెలలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 63 శాతం అధికంగా వర్షాలు నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మంచి వర్షపాతం నమోదైంది.

పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి తెలంగాణలో సగటు వర్షపాతం 84.1 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటి వరకు 137.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

 అక్టోబర్ మూడో వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఉంటుందన్న ఇండో-జర్మన్ పొట్స్‌డామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ శాస్త్రవేత్తల అంచనా నిజమైంది. టిప్పింగ్ ఎలిమెంట్ విధానం ద్వారా ఈ సంస్థ నాలుగేళ్లుగా వాతావరణ మార్పులపై అంచనా వేస్తోంది.

read more  weather report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన..

అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వివిధ రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా దీని ప్రభావం ఓడిషా, పశ్చిమ బెంగాల్ ల పైనే వుండగా కోస్తాంద్ర పై స్వల్పంగా వుండే అవకాశముంది. అయితే మోస్తరు వర్షాలు మాత్రమే కోసాంద్రలో కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios