ఢిల్లీకి బెయిర్ ‘స్ట్రోక్’...సన్రైజర్స్ ఖాతాలో హ్యాట్రిక్ విజయం
ఐపీఎల్ 2019లో సన్ రైజర్స్ దూసుకెళ్తోంది. వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.
ఐపీఎల్ 2019లో సన్ రైజర్స్ దూసుకెళ్తోంది. వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ... సన్రైజర్స్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఒక పక్క వికెట్లు పడుతున్నా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 43 పరుగులతో ఓపికగా ఆడాడు.
హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, నబి, సిద్ధార్థ్ కౌల్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సన్రైజర్స్కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా బెయిర్స్టో బాదుడు దాటికి ఢిల్లీ ఆటగాళ్లకు ఏం చేయాలో పాలు పోలేదు.
6 ఓవర్లకు సన్రైజర్స్ స్కోరు 62 పరుగులైతే ఇందులో బెయిర్స్టోనే 47 పరుగులు... వీరిద్దరి స్పీడుకి 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిస్తారనిపించింది. అయితే తెవాతియా .. బెయిర్స్టోను వెనక్కి పంపాడు.
ఆ తర్వాత వార్నర్ కూడా ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సన్రైజర్స్ కాస్తంత ఒత్తిడికి గురైంది. ఆ తర్వాత విజయ్ శంకర్, పాండే, హుడా కూడా ఔటవ్వడంతో విజయం ఢిల్లీ వైపు మళ్లీంది.
అయితే మహ్మద్ నబి 17, యూసుఫ్ పఠాన్ 9 ..ధాటిగా ఆడి సన్రైజర్స్కు విజయాన్ని అందించారు. నాలుగు మ్యాచ్ల్లో 3 విజయాలతో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.