Asianet News TeluguAsianet News Telugu

దాదా మార్క్ రూలింగ్: ద్రవిడ్‌తో భేటీకానున్న గంగూలీ.. ఎన్‌సీఏపై ఫోకస్

ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుని డే అంట్ నైట్ టెస్ట్ కోసం ఒప్పించిన దాదా.. టీమిండియా రోడ్ మ్యాప్‌కు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రావిడ్‌తో సమావేశం కానున్నాడు.

BCCI President Sourav ganguly set meet Rahul dravid discuss on cricket Development
Author
Mumbai, First Published Oct 29, 2019, 2:22 PM IST

బీసీసీఐ అధ్యక్షుడిగా తన మార్క్ పాలన మొదలెట్టారు సౌరవ్ గంగూలీ. ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుని డే అంట్ నైట్ టెస్ట్ కోసం ఒప్పించిన దాదా.. టీమిండియా రోడ్ మ్యాప్‌కు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రావిడ్‌తో సమావేశం కానున్నాడు. బుధవారం బెంగళూరులో వీరి భేటీ జరగనుంది. ద్రవిడ్ ఇచ్చే సూచనల ఆధారంగా ఒక ప్రణాళిక రూపొందించాలని దాదా భావిస్తున్నాడు. అదే సమయంలో ఎన్‌సీఏలో ద్రవిడ్ దృష్టికి వచ్చిన సమస్యలపై కూడా సౌరవ్ ఆరా తీయనున్నాడు. 

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత క్రికెట్ నియంత్రాణ మండలి అధ్యక్షుడిగా గంగూలీ ఏదో ఒక రోజున ఎన్నికవుతారని తాను 2007లోనే అనుకున్నానని సెహ్వాగ్ తెలిపాడు.

Also Read:దాదా విషయంలో ఒక జోస్యం ఫలించింది.. రెండోది సీఎం కావడమే: సెహ్వాగ్

అలాగే దాదా ఎప్పటికైనా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అవుతారని వీరేంద్రుడు అభిప్రాయపడ్డాడు. ఈ నెల 23వ తేదీన బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సెహ్వాగ్ స్పందిస్తూ దాదా ప్రెసిడెంట్‌‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నారని తెలిసి 2007లో జరిగిన ఓ ఘటన నాకు గుర్తుకు వచ్చింది. కేప్‌టౌన్‌లో జరుగుతున్న ఓ టెస్ట్ మ్యాచ్‌లో తాను.. వసీం జాఫర్ త్వరగా పెవిలియన్‌ చేరుకున్నామని.. అయితే సచిన్ అప్పటికి బ్యాటింగ్‌కు వెళ్లే పరిస్థితి లేదన్నాడు.

దీంతో గంగూలీ బ్యాటింగ్‌కు వెళ్లాడని.. అయితే ఆ సమయంలో దాదా అద్భుతమైన ప్రదర్శన చేశాడని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ సిరీస్‌ తమకు ఎంతో కీలకమని.. అలాంటి ఇన్నింగ్స్‌ ఆయనకు ఒక్కడికే సాధ్యమవుతుందని వీరేంద్రుడు తెలిపాడు.

Also read:దీపావళి పోస్టుతో రోహిత్ శర్మకు చిక్కులు: ఆడేసుకుంటున్న నెటిజన్లు

తమలో ఎప్పటికైనా బీసీసీఐ అధ్యక్షుడయ్యే అర్హత ఉందంటే అది గంగూలీ ఒక్కడికేనని తాను డ్రెస్సింగ్‌ రూమ్‌లో చెప్పగా అందుకు అందరూ అంగీకరించామని నాటి జ్ఞాపకాలను ఈ డాషింగ్ ఓపెనర్ గుర్తు చేసుకున్నాడు.

ఒక విషయం నిజమైంది.. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌కు చీఫ్ మినిస్టర్ అవ్వాల్సి ఉందని సెహ్వాగ్ వివరించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో ఆయన సమావేశమయ్యారు.

Also Read:షాక్ తిన్నా: బీసీసీఐ చీఫ్ గంగూలీ గదిపై వీవీయస్ లక్ష్మణ్ వ్యాఖ్య

భారతదేశంలో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని చర్యలను దాదా ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం బంగ్లాదేశ్‌తో త్వరలో జరిగే టీ20, టెస్ట్ సిరీస్‌‌ల కోసం జట్లను ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios