బంపర్ ఆఫర్.. విమాన టికెట్లపై 50శాతం డిస్కౌంట్
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్..వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్..వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతి తక్కువ ధరకి విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 50శాతం దాకా డిస్కౌంట్స్ అందిస్తోంది. దాదాపు సగం ధరకే టికెట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 25వ తేదీ వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రీమియం, ఎకానమి క్లాస్ సీట్లకు కూడా ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులు ఈ ణెల 21 నుంచి దేశీయ ప్రయాణికులు మార్చి 1 నుంచి ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు కచ్చితంగా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.