జాగ్వార్ నుంచి మార్కెట్లోకి లగ్జరీ ఎస్యూవీ ‘బేబీ’ రోవర్
దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) అత్యాధునిక మోడల్ కాంపాక్ట్ లగ్జరీ ఎస్యూవీని విడుదల చేసింది
లండన్: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) అత్యాధునిక మోడల్ కాంపాక్ట్ లగ్జరీ ఎస్యూవీని విడుదల చేసింది. లండన్ నగరంలోని జాగ్వార్ యూనిట్లోనే దీని డిజైన్ రూపకల్పనతోపాటు నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు తెలిపింది. బేబీ రేంజ్రోవర్గా పిలుస్తున్న ఈ కొత్త ఎస్యూవీ హల్లో రేంజ్ రోవర్ ఎవోక్ని లండన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది.
టెక్నాలజీ విప్లవంగా అభివర్ణించిన కొత్త మోడల్ ధర 41వేల డాలర్ల (సుమారు రూ.29లక్షలు)కు లభిస్తుంది. బేబీ రేంజ్ రోవర్ వచ్చే ఏడాది రోడ్లపై పరుగులు తీయనున్నదని కంపెనీ వెల్లడించింది. బిలియన్ పౌండ్ల పెట్టుబడులతో, బ్రిటన్లో ఉత్పత్తిపట్ల తమ నిబద్ధత స్థిరంగా ఉందని జెఎల్ఆర్ సీఈవో రాల్ఫ్ స్పెత్ తెలిపారు. తమ నూతన వాహనం రేంజ్ రోవర్ ఎవోక్యూ ప్రీ ఆర్డర్లను ఈవారం ప్రారంభించినట్టు జేఎల్ఆర్ తెలిపింది. అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల వినియోగదారులకు 2019 ప్రారంభంలో మొదటి డెలివరీ ఉంటుందని తెలిపిందిది
2020 నుండి ప్రతి కొత్త జాగ్వార్, ల్యాండ్ రోవర్లలో ఎలెక్ట్రిక్ వెర్షన్లను ప్రారంభిస్తామని తెలిపింది. కాంపాక్ట్ లగ్జరీ ఎస్యూవీ సెగ్మెంట్లో మొదటిదైన రేంజ్ రోవర్ ఎవోక్ వాహనాలను 48-వోల్ట్ మిల్డ్ హైబ్రిడ్ సిస్టమ్తో ప్రారంభిస్తామని పేర్కొంది. న్యూ ఎవోక్ మోడల్ కోసం బ్రిటన్ కంపెనీలు 4 బిలియన్ల పౌండ్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని తొలి ఉత్పత్తి హాలీవుడ్ కోసం చేపట్టినట్లు తెలిపింది.