కంపాక్ట్కు నో ప్రియారిటీ: మూడేళ్లలో టాప్ 5: కియోమోటార్స్ టార్గెట్
దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియో మోటార్స్ ప్రస్తుతం డిమాండ్ ఉన్న కంపాక్ట్ మోడల్ కార్ల విక్రయానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ సంస్థ యాజమాన్యం తేల్చేసింది. ఆరు నెలలకోక కొత్త మోడల్ మార్కెట్లోకి విడుదల చేస్తామని కియో మోటార్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కుక్ యుమ్షిమ్ తెలిపారు.
న్యూఢిల్లీ: ప్రస్తుతం అమ్మకాలు అధికంగా ఉండే కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్కు ప్రస్తుతం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదని కియో మోటార్స్ ఇండియా సీఈఓ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ కుక్ యున్షిమ్ పేర్కొన్నారు. మూడేళ్లలో అగ్రశ్రేణి అయిదు కంపెనీల్లో ఒకటిగా నిలవడం లక్ష్యమని చెప్పారు. దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా మోటార్స్ వచ్చే ఏడాది జూన్ నుంచి భారత్లో ఒక కొత్త మోడల్ బైక్, కారును వాహనాలను విక్రయించనున్నది.
ప్రతి ఆరు నెలలకూ ఒక కొత్త మోడల్ చొప్పున మూడేళ్లలో ఆరు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తెస్తామని కియా మోటార్స్ ఇండియా సీఈఓ, ఎండీ కుక్యున్ షిమ్ తెలిపారు.
‘మాస్ సెగ్మెంట్లో ప్రీమియమ్ బ్రాండ్గా నిలవాలనుకుంటున్నాం. ప్రస్తుతం మేం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో వాహనాలను విక్రయిస్తున్నాం. అపారమైన అనుభవం ఉంది. భారత్లో కాంపాక్ట్ కార్లు లేకుండా టాప్–5 కంపెనీల్లో ఒకటిగా నిలవటం దాదాపు అసాధ్యం. కానీ మా అనుభవం ఆధారంగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. అమ్మకాల తోడ్పాటు కోసం, అవసరమైనప్పుడు, కాంపాక్ట్ కార్లను కూడా రంగంలోకి దింపుతాం’’ అని కియా మోటార్స్ ఇండియా సీఈఓ, ఎండీ కుక్యున్ షిమ్ తెలియజేశారు.
ఈ ఏడాది ఆటో ఎక్స్పోలో ప్రదర్శించిన ఎస్యూవీ, ఎస్పీ కాన్సెప్ట్తో భారత్లో అమ్మకాలు ఆరంభిస్తామని కియా మోటార్స్ ఇండియా సీఈఓ, ఎండీ కుక్యున్ షిమ్ తెలిపారు. భారత వినయోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ కారును తయారు చేస్తున్నామని చెప్పారు.
‘ఈ కారు చక్కని అమ్మకాలు సాధిస్తుందన్న ధీమా ఉంది. భవిష్యత్తులో కూడా వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగానే వాహనాలను అందిస్తాం. భారత వాహన మార్కెట్ చాలా భిన్నమైనది. ప్రతి సెగ్మెంట్లోనూ విభిన్న రకాలైన వాహనాలు అవసరం’ అనికియా మోటార్స్ ఇండియా సీఈఓ, ఎండీ కుక్యున్ షిమ్ తెలిపారు. కియా మోటార్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో 110 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఒక ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ వార్షిక వాహన ఉత్పత్తి సామర్థ్యం మూడు లక్షలు ఉంటుందన్నారు.
ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ రిటర్న్ ఫారాలు
వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సరళంగా ఉండే కొత్త జీఎస్టీ ఫారాలను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను కచ్చితంగా సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పన్నులు ఎగవేస్తున్న సంస్థల వివరాలను రెవెన్యూ శాఖ సేకరిస్తోందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం వద్ద మీడియాతో పాండే చెప్పారు.