Asianet News TeluguAsianet News Telugu

21 అక్టోబర్ 2019 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాల వల్ల సంతోషం ఏర్పడతాయి. భాగస్వాములతో అనుకున్న పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పలుకుబడికోసం ఆరాటపడతారు. ఆప్త మిత్రులతో జాగరూకతతో ఉండాలి. మోసపోకుండా కాపాడుకోవాలి.

today 21st october 2019 your horoscope
Author
Hyderabad, First Published Oct 21, 2019, 7:34 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పరామర్శలు చేస్తారు. శ్రమలేని సంపాదనపై ఆలోచన పెంచుకునే అవకాశం ఏర్పడతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంాయి.  అనారోగ్య సమస్యలు ఉంాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు.  అన్ని పనుల్లోను ఆటంకాలు ఏర్పడతాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాల వల్ల సంతోషం ఏర్పడతాయి. భాగస్వాములతో అనుకున్న పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పలుకుబడికోసం ఆరాటపడతారు. ఆప్త మిత్రులతో జాగరూకతతో ఉండాలి. మోసపోకుండా కాపాడుకోవాలి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. శతృవులపై విజయానికి ఆరాటపడతారు. ఋణాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అనేక రకాల ఇబ్బందులు ఒకేసారి వస్తాయి. వృత్తి విద్యల్లో జాగ్రత్త అవసరం. పెద్దవారితో పనులు పూర్తి చేసుకోవడానికి శ్రమ అవసరం.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానం వల్ల సంతోషం ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. సంపదలు పెంచుకునే ఆలోచనలో ఉంారు. సంతృప్తికర వాతావరణం ఉంటుంది. చిత్త చాంచల్యం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మాతృసౌఖ్య లోపం ఏర్పడుతుంది. వాహనాలవల్ల ఇబ్బందులు ఉంాయి. ఆర్థిక లోపాలు ఉంాయి. విద్యార్థులు ఒత్తిడికి గురి అవుతారు. ఆహార విషయంలో సమయ పాలన మంచిది. సుగంధ ద్రవ్యాలపై ఆలోచన పెరుగుతుంది. గృహ సంబంధ పనుల్లో ఒత్తిడి తీవ్రమయ్యే సూచనలు ఉన్నాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  సహకార లోపం ఏర్పడుతుంది. సహోద్యోగులతో అప్రమత్తత అవసరం. కమ్యూనికేషన్స్‌ వల్ల లోపాలు ఉంాయి. అన్ని రకాల ఆటంకాలు ఏర్పడే సూచన. పరామర్శలు చేస్తారు. చిత్త చాంచల్యం ఉంటుంది. ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగుతాయి. మాట విలువ పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. అన్ని రకాల సంతోషాలు ఉంాయి.  కిం సంబంధ లోపాలు తొలిగే సూచన.  మధ్యవర్తిత్వాలు పనికిరావు. తొందరపాటు నిర్ణయాలు కూడదు.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  శారీరక శ్రమ ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థాన మార్పు సూచితం. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అభిరుచులకు తగిన పనులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రమకు తగిన ఫలితంకోసం అన్వేషణ అవసరం. వచ్చిన దానిలో సంతృప్తి పొుందే అలవాటు చేసుకోవాలి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. విశ్రాంతి లోపం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. అన్ని రకాల ఖర్చులుఉంాయి. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ప్టోలి. ఆధ్యాత్మిక ఖర్చులు చేస్తారు. పాదాల నొప్పులు ఉంాయి. పనుల ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కళలపై ఆసక్తి పెరుగుతుంది. అన్ని రకాల ఆదాయాలు ఉంాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఉపాసనపై దృష్టి ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గురువులు పెద్దలతో సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : చేసే పనుల్లో ఒత్తిడి ఉంటుంది. అధికారులతో అననుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాల్లో ఆటంకాలు. పెద్దల వల్ల భయం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం కోసం ఎదురుచూస్తారు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. సజ్జన సాంగత్యం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన చేస్తారు. పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉంాయి. తీర్థయాత్రలు చేస్తారు.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios