బాబు, లోకేష్, ఆదిల హస్తం: వైఎస్ వివేకా మృతిపై రవీంద్రనాథ్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై చంద్రబాబునాయుడు, లోకేష్, మంత్రి ఆదినారాయణరెడ్డి హస్తం ఉందని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై చంద్రబాబునాయుడు, లోకేష్, మంత్రి ఆదినారాయణరెడ్డి హస్తం ఉందని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
శుక్రవారం నాడు ఆయన కడపలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.సిట్ దర్యాప్తుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. సీబీఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.
ఎన్నికల్లో తమను దెబ్బకొట్టేందుకు ఈ కుట్రకు పాల్పడ్డారని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. తమకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం
వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్
ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి
తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?
నాడు జగన్తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ
వివేకా బాత్రూం, బెడ్రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ
వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి
వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం
నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...
వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం