వైసీపీలో చేరిన యాంకర్ శ్యామల దంపతులు
తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని శ్యామల స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చేపడుతున్న నవరత్న పథకాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. అందువల్లే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.
హైదరాబాద్: ప్రముఖ యాంకర్, నటి శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శ్యామల తన భర్త నర్సింహారెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వైఎస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని శ్యామల స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చేపడుతున్న నవరత్న పథకాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.
అందువల్లే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఏపీ ప్రజలతోపాటు తాము కూడా వైఎస్ జగన్ సీఎం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మంచి భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.
సరికొత్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని శ్యామలదంపతులు తెలిపారు. తాము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లు శ్యామల దంపతులు తెలిపారు.