Asianet News TeluguAsianet News Telugu

ఆయన నిజాలు మాట్లాడకూడదు, ఒక శాపం ఉంది: బాబుపై షర్మిల సెటైర్లు

గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 600 హామీలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కొత్త మేనిఫెస్టో అని మరో పుస్తకాన్ని తయారుచేశారని ఎద్దేవా చేశారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల. 

ys sharmila satires on ap cm chandrababu naidu
Author
Razole, First Published Apr 7, 2019, 3:42 PM IST

గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 600 హామీలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కొత్త మేనిఫెస్టో అని మరో పుస్తకాన్ని తయారుచేశారని ఎద్దేవా చేశారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల.

ఎన్నికల ప్రచారంలో ఆమె ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురం ప్రచారసభలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ను కమీషన్ కోసం చంద్రబాబు తీసుకున్నారని... 15 వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌ను 60 వేల కోట్లకు పెంచారని షర్మిల ఆరోపించారు.

గత ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లోంచి కూడా తీసేశారని... కొత్త మేనిఫెస్టోలో పాత వాటిని పెట్టారని ఆమె దుయ్యబట్టారు. 50 శాతం పాత హామీలు.. మరో 50 శాతాన్ని వైసీపీ నుంచి చంద్రబాబు కాపీ కొట్టారని షర్మిల మండిపడ్డారు.

హైదరాబాద్‌ను నేనే కట్టానని, అమరావతిని నేనే కడతానన్న చంద్రబాబు కనీసం ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా..? కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఇస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదన్నారు.

ప్రత్యేకహోదా కోసం జగన్ చేయని పోరాటం లేదని... ఆఖరికి ఎంపీలతో రాజీనామాలు కూడా చేయించారని కానీ చంద్రబాబు ఇవాళ యూటర్న్ తీసుకుని హోదా అంటున్నారని దీనికి కారణం జగనేనన్నారు.

చంద్రబాబు నెత్తి మీద నిజం ఉందని... ఆయన ఏ రోజు నిజాలు మాట్లాడితే.. ఆరోజు తల వెయ్యి ముక్కలు అవుతందట.. అందుకే చంద్రబాబు నిజాలు మాట్లాడరని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios