స్వంత అక్కా చెల్లెళ్లనే పట్టించుకోలేదు: కుప్పంలో బాబుపై జగన్
స్వంత తమ్ముడినే చంద్రబాబు నాయుడు చిన్నచూపు చూశారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విమర్శించారు. 30 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబునాయుడు ఏం చేయలేదని ఆరోపించారు.
కుప్పం: స్వంత తమ్ముడినే చంద్రబాబు నాయుడు చిన్నచూపు చూశారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విమర్శించారు. 30 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబునాయుడు ఏం చేయలేదని ఆరోపించారు.
శుక్రవారం నాడు చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. స్వంత అక్కా చెల్లెళ్లకు కూడ చంద్రబాబునాయుడు న్యాయం చేయలేదన్నారు. అలాంటి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు..
పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబునాయుడు కొత్త సినిమా చూపిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబునాయుడు లాక్కొన్నారన్నారు.
30 ఏలళ్లుగా కుప్పం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నా కనీసం పాలిటెక్నిక్ కాలేజీ కూడ తీసుకురాలేదని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ పనిచేయకుండా చేశారని ఆయన ఆరోపించారు.
చంద్రగిరిలో ఓడిపోతామని భావించి 1989 నుండి కుప్పం అసెంబ్లీ స్థానం నుండి చంద్రబాబునాయుడు పోటీచేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు.వైసీపీ కార్యకర్తలపై చంద్రబాబునాయుడు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలపై బనాయించిన కేసులను ఎత్తివేస్తామని ఆయన హామీ ఇచ్చారు.