మహిళలేనా: పరిటాల సునీత, అఖిలప్రియలపై రోజా నిప్పులు
చంద్రబాబుని డాటా బాబాఅని, ఆయన కుమారుడు లోకేష్ బేటా బాబా అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజల సమాచారాన్ని చోరీ చేసిన డేటా, బేటా బాబాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. డేరా బాబా ఆడవాళ్ల మాన ప్రాణాలతో చెలగాట మాడితే డేటా బాబా, బేటా బాబాలు ప్రజల భద్రతతో చెలగాటమాడుతున్నారని స్పష్టం చేశారు.
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన రోజా రాప్తాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబుపై మండిపడ్డారు.
ముందుగా మహిళలకు అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలిపిన రోజా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కోడలు మగపిల్లాడు కంటానంటే అత్త వద్దు అంటుందా అంటూ ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు.
ప్రజలకు సేవ చేద్దామని ప్రభుత్వ ఉద్యోగంలోకి అడుగుపెట్టిన ఎమ్మార్వో వనజాక్షిని ఇసుకలో పెట్టి కొడితే రాజీచేసిన చంద్రబాబు మహిళా వ్యతిరేకి అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణలేదని ఆరోపించారు.
ఆడది వంటింట్లో ఉండాలి, ట్రాక్టర్ షెడ్ లో ఉండాలి అంటూ మహిళలపై వ్యాఖ్యలు చేసిన కోడెల శివప్రసాదరావు స్పీకరా అంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని ప్రశ్నించినందుకు నిబంధనలకు విరుద్ధంగా తనను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారంటూ విరుచుకుపడ్డారు.
అనంతపురం జిల్లాను పరిటాల సునీత కుటుంబాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. అడ్డువచ్చిన వారి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదని ఆరోపించారు. మంత్రిస్థానంలో ఉండి పరిటాల సునీత మహిళలను వేధించడం దుర్మార్గమంటూ విరుచుకుపడ్డారు.
మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతుందే స్పందించని మంత్రులు అఖిలప్రియ, పరిటాల సునీతలు అసలు మహిళలేనా అంటూ విరుచుకుపడ్డారు. మహిళల మంగళసూత్రాలు తెగిపడుతున్నా మంత్రులు సునీత, అఖిలప్రియ స్పందించకపోవడం దారుణమన్నారు
మహిళల వేధింపుల్లో ఏపీని నెంబర్వన్గా నిలిపిన ఘనత చంద్రబాబుదే అంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు డేటా చోరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని డాటా బాబాఅని, ఆయన కుమారుడు లోకేష్ బేటా బాబా అంటూ ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రజల సమాచారాన్ని చోరీ చేసిన డేటా, బేటా బాబాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. డేరా బాబా ఆడవాళ్ల మాన ప్రాణాలతో చెలగాట మాడితే డేటా బాబా, బేటా బాబాలు ప్రజల భద్రతతో చెలగాటమాడుతున్నారని స్పష్టం చేశారు.
డేరా బాబాను ఎలా అయితే జైల్లో పెట్టారో చంద్రబాబును లోకేష్ లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ ఐటీ మినిస్టర్ గా పనికిరాడని లూటీ మినిస్టర్ గా పనికొస్తాడంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఓ పశుపతి అంటూ ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు ఓటేస్తే బొమ్మాళీ నిన్ను వదలా అంటూ మహిళలపై విరుచుకుపడతారంటూ ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు చెక్కులతో మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మహిళల సాధికారికత కేవలం వైఎస్ జగన్ వల్లే సాధ్యమన్న రోజా, వైఎస్ జగన్కు ఆడపడుచులు అండగా నిలవాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
అధికారమిచ్చిన ప్రజలను నడిరోడ్డుపై నిలబెడతారా..?: డేటా చోరీ కేసులో చంద్రబాబు, లోకేష్ లపైరోజా ఫైర్