Asianet News TeluguAsianet News Telugu

హరికృష్ణ, తారక్, సుహాసినిలను వాడుకుని వదిలేశాడు: బాబుపై మోహన్ బాబు నిప్పులు

హరికృష్ణ, తారక్‌, సుహాసినిలను వాడుకుని వదిలెయ్యలేదా అని నిలదీశారు. ఎవరైనా బాగుంటే చాలు వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలరన్నారు. అన్నయ్య చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు పాపిష్టి, నికృష్టుడు, మోసకారని ఆ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. 

Mohan babu makes serious comments against Chnadrababu
Author
Guntur, First Published Apr 1, 2019, 12:56 PM IST

మంగళగిరి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైసీపీ నేత, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. వైస్రాయ్‌ హోటల్‌ వద్ద దివంగత సీఎం ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం వాస్తవమని, అది తాను చూశానని స్పష్టం చేశారు. 

సోమవారం మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోహన్ బాబు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే తో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను చేసిన తప్పెంటో చెప్పండి బ్రదర్‌.. తప్పు సరిద్దిదుకుంటాను అని వేడుకున్న అన్నగారిపై చంద్రబాబు చెప్పులు వేయించారని మండిపడ్డారు. 

నాయకులందరినీ చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారని, అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకు పోయిందని మోహన్ బాబు ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్నయ్య ఎన్టీఆర్‌ ది కాదన్నారు. చంద్రబాబు ఆక్రమించిన పార్టీ అంటూ ధ్వజమెత్తారు. 

అన్నయ్య ఏదో అయితే తాను పార్టీ వీడేవాడినే కాదని కానీ ఆయన పార్టీని ఆక్రమించి చివరకు సభ్యత్వాన్నే తీసేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. 

హరికృష్ణ, తారక్‌, సుహాసినిలను వాడుకుని వదిలెయ్యలేదా అని నిలదీశారు. ఎవరైనా బాగుంటే చాలు వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలరన్నారు. అన్నయ్య చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

చంద్రబాబు పాపిష్టి, నికృష్టుడు, మోసకారని ఆ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. మరోవైపు దివంగత సీఎం వైఎస్ఆర్ మహోన్నతమైన వ్యక్తి అంటూ కొనియాడారు. కాంగ్రెస్‌ వంటి మహాసముద్రంలో ఓ మహానాయకుడిగా ఎదిగి పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకొని అద్భుత పథకాలు రూపొందించారని తెలిపారు. 

ఎంతోమంది పేద పిల్లలు ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత చదువులు చదివేలా చేశారని ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించారని తెలిపారు. తాను పార్టీకి బానిసను కాదని, ప్రజలకు బానిసనంటూ సోనియాగాంధీని సైతం వ్యతిరేకించిన దమ్మున్న నేత వైఎస్ఆర్ అంటూ చెప్పుకొచ్చారు. 

ఆ తర్వాతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారని చెప్పుకొచ్చారు. ఆ మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారని ఆయనను అక్కున చేర్చుకుని సీఎంను చేసుకుందామని ప్రకటించారు. 

మూడు పంటలు పండే చోట రాజధాని పేరుతో భూములు లాక్కుని రైతుల నోట్లో మట్టికొట్టారంటూ ధ్వజమెత్తారు. తన బినామీలతో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ముందుగానే కొనుగోలు చేయించారని ఆరోపించారు. 

చంద్రబాబుపై ఉన్న 11 కేసులను ప్రజలకు తెలియకుండా దాచారని ఆరోపించారు. టీడీపీ ఎంపీల అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడతావా అంటూ విరుచుకుపడ్డారు. 

వేల కోట్లు ఆస్తులు నీకెక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. పసుపు కుంకుమ పేరుతో ఇస్తున్న డబ్బులు నీవా చంద్రబాబు? అంటూ ప్రశ్నించారు. నాలుగేళ్లుగా పసుపు కుంకుమ గుర్తుకు రాలేదా?అని నిలదీశారు. 

రాబోయే ఎన్నికల్లో 135 సీట్లతో వైఎస్ జగన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాని జోస్యం చెప్పారు. మంగళగిరిలో అందరికీ అందుబాటులో ఉండే ఆళ్ల రామకృష్ణారెడ్డిని, గుంటూరు ఎంపీగా మోదుగు వేణుగోపాల్‌రెడ్డిలను గెలిపించాలని కోరారు. చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తుల వల్ల ఏం లాభం లేదంటూ గల్లా జయదేవ్ పై సెటైర్ వేశారు మోహన్ బాబు.  

Follow Us:
Download App:
  • android
  • ios