Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ రెడీ

:రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు  ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఉన్న నియోజకవర్గాల్లో  కూడ పోటీ చేయాలని  టీడీపీ నిర్ణయం తీసుకొంది

tdp plans to contest in odisha assembly elections
Author
Amaravathi, First Published Dec 9, 2018, 4:10 PM IST


అమరావతి:రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు  ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఉన్న నియోజకవర్గాల్లో  కూడ పోటీ చేయాలని  టీడీపీ నిర్ణయం తీసుకొంది. గతంలో  కూడ కొన్ని స్థానాల్లో  పోటీ చేసింది. జాతీయ రాజకీయాల్లో  కూడ   క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.

వచ్చే ఏడాది ఒడిశా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా  నివసించే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.  ఒడిశాలోని బరంపుర, కటక్, రాయగడ, కోరాపుట్ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే  విషయమై ఆ పార్టీ నేతలు చంద్రబాబునాయుడుతో చర్చించారు.

ఈ రాష్ట్రంలోని రాయగడ, మల్కన్ గిరి, గంజాం, నవరంగపూర్ జిల్లాల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని  భావిస్తున్నారు.  ఈ నియోజకవర్గాల్లో  పరిస్థితులపై సర్వే నిర్వహిస్తున్నారు. మరో వైపు 147 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయమై  ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios