రెండు గంటల పాటు బస్సు కిందనే: సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్
గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి రాడ్స్ ను కట్ చేసి డ్రైవర్ వలీని వెలికి తీశారు. నవాబుపేట వద్ద రమణ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.
విజయవాడ: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంల డ్రైవర్ రెండు గంటలపాటు బస్సు కిందనే ఉండిపోయాడు. రెండు గంటల తర్వాత అతను బస్సు కింది నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
గ్యాస్ కట్టర్స్ ఉపయోగించి రాడ్స్ ను కట్ చేసి డ్రైవర్ వలీని వెలికి తీశారు. నవాబుపేట వద్ద రమణ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడినవారిలో పది మంది చిన్నారులు ఉన్నారు. కాగా, బస్సు డ్రైవర్ వలి బస్సు కింద ఇరుక్కుపోయాడు. చివరకు రెండు గంటల పాటు శ్రమించి అతన్ని బయటకు తీశారు.
అదుపు తప్పి బోల్తా: బస్సు కింద ఇరుక్కున్న డ్రైవర్ (వీడియో)