Asianet News TeluguAsianet News Telugu

పగో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...అమ్మమ్మ, మనవడి మృతి

ఇవాళ తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంగా వెళుతూ అదుతప్పడంతో ఇద్దరి ప్రాణాలు బలయ్యాయి. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

road accident  at west godavari district
Author
Tadepalligudem, First Published Feb 9, 2019, 10:29 AM IST

ఇవాళ తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంగా వెళుతూ అదుతప్పడంతో ఇద్దరి ప్రాణాలు బలయ్యాయి. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

వైజాగ్ కు చెందిన దంపతులు శ్రీనివాస్(54)), అన్నపూర్ణ(51), ఏడాది వయసున్న తమ మనవడు ఆరుష్ని తీసుకుని కారులో కృష్ణాజిల్లా గంటుమిల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జాతీయ రహదారిపై అతివేగంగా వెళుతున్న కారు రోడ్డుపక్కనున్న రైలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారును డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ నిద్రమత్తులో వుండటంతో ఈ ప్రమాదం జరిగి వుంటుందని పోలీసులు తెలిపారు.  

ఈ ప్రమాదంలో అన్నపూర్ణ తో పాటు ఆరుష్ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అతడి పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు సమాచారం. 

ఈ ఘటనపై సమాచానం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.     

Follow Us:
Download App:
  • android
  • ios