Asianet News TeluguAsianet News Telugu

మరోసారి చిక్కుల్లో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్

పోలీసుల తీరుపై అఖిలప్రియ విమర్శలు గుప్పించారు. భార్గవ్ అనుచరులు కానిస్టేబుల్ మొబైల్ లాక్కొని బయటకు నెట్టేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రెండు కేసులు ఉన్నాయి.

ex minister bhuma akhilapriya husband obstructing AP police
Author
Hyderabad, First Published Oct 22, 2019, 8:19 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. కేసు విచారణ కోసం వచ్చిన పోలీసులపై భార్గవ్ తో పాటు ఆయన అనుచరులు జులం ప్రదర్శించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. అయితే పోలీసులే తమపై దాడికి పాల్పడ్డారని అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి టీడీపీ నేత అఖిల ప్రియ భర్త భార్గవ్ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో  నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను  ప్రశ్నించడానికి హైదరాబాద్ వచ్చారు కర్నూలు జిల్లా పోలీసులు.

హైదరాబాద్ యూసుఫ్ గూడాలో భార్గవ్ రామ్‌ కు చెందిన మహాత్మాగాంధీ స్కూల్‌లో ఉన్నట్లు సమాచారం ఉండటంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. దౌర్జన్యంగా తాము ఉంటున్న స్కూల్ లోకి వచ్చి దాడి చేశారంటూ అఖిలప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్గవ్ తో పాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పోలీసుల తీరుపై అఖిలప్రియ విమర్శలు గుప్పించారు. భార్గవ్ అనుచరులు కానిస్టేబుల్ మొబైల్ లాక్కొని బయటకు నెట్టేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రెండు కేసులు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లోనూ ఫిర్యాదు అందించింది. ఆళ్లగడ్డ ఎస్‌ఐ రమేశ్‌ కుమార్ భార్గవ రామ్ పై కేసు పెట్టారు. ఈ కేసుల విచారణకు భార్గవ్ సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు.  

కాగా... అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై శివరాం రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. క్రషర్ మిషన్  కోసం తనను బెదిరించారని శివరాంరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. మిగిలిన 60 శాతం వాటా తమ పేరుపై బదిలీ చెయ్యాలని శివరామిరెడ్డి కుటుంబసభ్యులపై బెదిరింపులకు దిగారు.

దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు....ఈ క్రమంలో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తన భర్తపై హత్యాయత్నం చేసినట్లు శివరామిరెడ్డి భార్య మాధవీలత ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 14వ తేదీన భార్గవ్‌రామ్, అతడి అనుచరులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చి అక్కడున్న వారిని తరిమేసి తాళాలు వేశారని మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత నెల 27వ తేదీన మరో పరిశ్రమను స్వాధీనం చేసుకుని రెండింటిని తమపేరిట రాసివ్వాలని డిమాండ్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ పై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేశారు. కొండాపురం లో వున్న క్రషర్ క్వారీ   ఫ్యాక్టరీ వివాదంలో యజమాని శివరామిరెడ్డి ఫిర్యాది మేరకు భార్గవ్ రామ్ తో సహా 10 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. భార్గవ్ రామ్ పీఏ మహేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు పోలీసులు.

ఈ కేసులో భార్గవ్ రామ్‌తో పాటు మాదల శ్రీను,నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి,శ్రీను, అల్లా సుబ్బయ్య,నాగేంద్ర,డ్రెవర్ గణేష్,మంగలి పవన్,సంపత్ నాని,షరీఫ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios