చెట్టెక్కి కూర్చొన్న చిరుత: హడలెత్తుతున్న అంకంపాలెం
తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెంలో చిరుత కలకలం సృష్టించింది
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెంలో చిరుత కలకలం సృష్టించింది. గ్రామంలోని ముగ్గురుపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు చిరుతను బంధించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
అంకంపాలెంట్ గ్రామంలోకి చిరుతపులి వచ్చింది. ఈ చిరుతను గమనించన ముగ్గురిపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.గ్రామంలో ప్రవేశించిన చిరుతను బంధించేందుకు అటవీశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రామంలోని ఓ కొబ్బరిచెట్టు మీదకు చిరుతపులి కూర్చొంది.అటవీ ప్రాంతం నుండి అంకంపాలెం గ్రామ సమీపంలోని లంక గ్రామాల్లోకి వచ్చినట్టుగా అటవీశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు.