జగన్ కు అమిత్ షా ఫోన్
రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన వెంటనే ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఫోన్ చేసి మద్దతు కోరారు, మరొక వైపు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్నోహన్ రెడ్డి కి ఫోన్ చేసి సహకారం కోరారు.
రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన వెంటనే ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఫోన్ చేసి మద్దతు కోరితే, మరొక వైపు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్నోహన్ రెడ్డి కి ఫోన్ చేసి మద్దతు కోరారు.
రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థి రాంనాథ్ కోవింద్ కు మద్దతు ఇవ్వాలని అమిత్ షా కోరారుని కోరారు. ఎన్డీఏ అభ్యర్థి రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నిక అయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారం కోరుతున్నామని, ఆంధ్రప్రదేశ్ లోని వైసిపి కూడా సహకరించాలని షా కోరారు.
దళితవర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ అభ్యర్థిత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జగన్ షాకు హమీ ఇచ్చారు.